Homeతెలంగాణకల్వకుంట్ల కవితకు శివన్నగూడెం ప్రాజెక్ట్ కనపడలేదా..?

కల్వకుంట్ల కవితకు శివన్నగూడెం ప్రాజెక్ట్ కనపడలేదా..?

మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):- గత కొన్ని రోజుల క్రితం కల్వకుంట్ల కవిత, కిష్టరాయినిపల్లి ప్రాజెక్ట్ సందర్శన, ప్రస్తుతం మర్రిగూడ మండల కేంద్రంలో చర్చనియాంశంగా మారింది.. కూతవేటు దూరంలో ఉన్న శివన్నగూడెం ప్రాజెక్ట్ కి, ఆమె ఎందుకు రాలేకపోయారంటూ అనుకుంటున్నారు..

కవిత శివన్నగూడెం ప్రాజెక్ట్ కి రాకుండా, మండలంలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు మనిషి అడ్డుకున్నట్లు తెలుస్తుంది.. బిఅర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ కూతురు అయినప్పటికీ, సొంత ఇంటిలో కుంపటిగా మారిన కవితకు, ఒక పక్క హరీష్ రావు, మరో పక్క కేటీఆర్ టార్గెట్ గా మారిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసిన ముచ్చటే.. కవిత పర్యటనలో శివన్నగూడెం ప్రాజెక్ట్ కూడా ఉన్నప్పటికి, మధ్యలో బ్రేక్ కావడంపై అనేక చర్చలకు దారి తీస్తుంది..

మండలంలో హరీష్ రావు మనిషి దేశ్ ముఖ్ ఈ పర్యటనను నిలుపుదల చేసినట్లు సమాచారం..? మరి హరీష్ రావు శివన్నగూడెం ప్రాజెక్ట్ సందర్శించి, అధికార పార్టీ నిర్లక్ష్యంపై ప్రశ్నించునున్నారా.. అందుకే కవిత పర్యటనకు ఆటంకం కలిగించారా అంటూ మండలంలో చర్చ జరుగుతుంది..

హరీష్ రావుకు అత్యంత సన్నిహితంగా ఉండే సదరు వ్యక్తి, తమ పార్టీ ప్రతినిధులతో మాట్లాడి ఈ సాహసం చేసినట్లు, కవిత సానుభూతిపరులను కూడా అక్కడికి వెళ్లకుండా ఆపారని ప్రచారం.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు