Homeఅంతర్జాతీయంఆగస్టు 29 నుంచి.. జపాన్, చైనా పర్యటనకు ప్రధాని మోడీ!

ఆగస్టు 29 నుంచి.. జపాన్, చైనా పర్యటనకు ప్రధాని మోడీ!

PM Modi Japan-China Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు జపాన్, చైనాలో పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు, ప్రధాని మోడీ ఆగస్టు 29, 30 తేదీల్లో 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ప్రధాని హోదాలో మోడీ 8వ సారి జపాన్ పర్యటనకు వెళ్తున్నారు. ఇషిబాతో ప్రధానికి ఇది తొలి శిఖరాగ్ర సమావేశం అని విదేశాంగశాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో ఇద్దరు నాయకులు భారత్ – జపాన్ మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, ప్రజల మధ్య మార్పిడిఅంశాలపై చర్చినున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత పెంచుతుందని విదేశాంగశాఖ వెల్లడించింది.

చైనాలో రెండు రోజుల పర్యటన

జపాన్ పర్యటన తర్వాత ప్రధాని మోడీ చైనాకు వెళ్లనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు, ప్రధాని  ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. భారత్ 2017 నుండి SCOలో సభ్యదేశంగా మారింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి తాజాగా ప్రధాని మోడీని కలిసి, SCO శిఖరాగ్ర సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానాన్ని అందజేశారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు