Saturday, March 7, 2026
Homeజాతీయంభారత అమ్ముల పొదిలోకి మరో రెండు బాలిస్టిక్ మిస్సైల్!

భారత అమ్ముల పొదిలోకి మరో రెండు బాలిస్టిక్ మిస్సైల్!

Ballistic Missiles: భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు డీఆర్డీఓ కీలక పరిశోధనలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ 2, అగ్ని 1 పరీక్ష విజయవంతం అయింది. ఒడిశాలోని  చాందీపూర్‌ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని పరీక్షించారు. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో వీటి పరీక్ష జరిగింది. పృథ్వీ 2, అగ్ని 1 ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్‌ ను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష విజయవంతం అయినట్లు అధికారులు తెలిపారు.

పృథ్వీ 2 మిస్సైల్  గురించి..

ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. దీనిని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) అభివృద్ధి చేసింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అవకాశం ఉంటుంది. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ దీనిని వాడుతుంది. ఈ క్షిపణి రేంజ్ 350 కిలోమీటర్లు. 500 నుంచి 1000 కేజీల వార్ హెడ్స్ ను మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది.

అగ్ని 1 మిస్సైల్ గురించి..   

ఇది కూడా షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. దీనిని కూడా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) డెవలప్ చేసింది. ఈ క్షిపణి 700 నుంచి 900 కిలోమీటర్లు రేంజ్ లోని లక్ష్యాలను చేధిస్తుంది. ఇది 1000 కేజీల వార్ హెడ్స్ ను మోసుకెళ్లే అవకాశం ఉంటుంది. తక్కువ లోడు ఉంటే ఏకంగా 1200 కిలో మీటర్లు దూసుకెళ్లే అవకాశం ఉంటుంది.

Read Also: నిమిష ప్రియ కేసు.. భారత విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments