Homeతెలంగాణరైతులకు తీపికబురు: ఒకే విడతలో పూర్తి నిధులు విడుదల..!

రైతులకు తీపికబురు: ఒకే విడతలో పూర్తి నిధులు విడుదల..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పనుంది. తొలుత శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా కేవలం సాగులో ఉన్న భూములకే నిధులు ఇవ్వాలని భావించినప్పటికీ, ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే అర్హులైన అందరు రైతులకు నిధులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఒకే విడతలో పూర్తి నిధులను విడుదల చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ నేటితో (ఫిబ్రవరి 16) ముగియనుండటంతో, వెంటనే నిధుల విడుదల ప్రక్రియ మొదలుకానుందిని సమాచారం.

రైతు భరోసా నిధులను ఫిబ్రవరి 17, 2026 (రేపు) నుండి రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. ఈసారి గతంలో వలె కాకుండా, ఒకే విడతలో పూర్తి నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే RBI ద్వారా సుమారు ₹9,000 కోట్ల రుణం సేకరించిందిని తెలుస్తుంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు