Homeతెలంగాణతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 న లోక్ అదాలత్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 న లోక్ అదాలత్

క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, తాలూకా కోర్టులలో ఈనెల నవంబర్ 15, 2025న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఇది కక్షిదారులకు ఒక ప్రత్యేక అవకాశం అని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరగకుండా మీ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తులు సూచిస్తున్నారు.

Also Read:ఒకవైపు కార్తీక పౌర్ణమి.. మరోవైపు వర్షపు ముప్పు

ఈ లోక్ అదాలత్ లో ఎ కేసులు పరిష్కరించబడతాయి: సివిల్ కేసులు, మోటారు ప్రమాదాల క్లెయిమ్‌లు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు మరియు రాజీ పడదగిన ఇతర క్రిమినల్ కేసులు.

ఎలా సద్వినియోగం చేసుకోవాలి: కక్షిదారులు తమకు సంబంధించిన కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవడానికి తమ దగ్గరలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (District Legal Services Authority – DLSA) లేదా సంబంధిత కోర్టు సిబ్బందిని సంప్రదించవచ్చు. న్యాయవాదులు కూడా తమ క్లయింట్‌ల కేసులను ఈ అదాలత్‌లో పరిష్కారమయ్యేలా చూడాలని సూచించబడింది.

Also Read:గల్లి గల్లీలో చెత్త ఉంది.. ఆ చెత్త నా కొడుకు వల్లే కదా : సీఎం రేవంత్

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు