Homeతెలంగాణగ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి - సర్పంచ్ ఎలికట్టి భరత్

గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి – సర్పంచ్ ఎలికట్టి భరత్

  • గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి

  • తాగునీరు, పరిశుభ్రత, పచ్చదనం అభివృద్ధికి ప్రాధాన్యత

  • లక్ష్మీదేవిగూడెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం –

  • సర్పంచ్ ఎలికట్టి భరత్

క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిధి: గ్రామాభివృద్ధే ధ్యేయంగా లక్ష్మీదేవిగూడెం గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన సుందర గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సర్పంచ్ ఎలికట్టి భరత్ తెలిపారు. శనివారం వేములపల్లి మండలంలోని లక్ష్మీదేవిగూడెంలో పంచాయతీ కార్యదర్శి కళ్యాణి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, సురక్షిత తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ అంశాలకు గ్రామపంచాయతీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని విస్తృతంగా చేపడుతున్నామని తెలిపారు.

లక్ష్మీదేవిగూడెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
లక్ష్మీదేవిగూడెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నాటిన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రజల సహకారంతో లక్ష్మీదేవిగూడెంను మండలంలోనే ఆదర్శ గ్రామంగా నిలబెడతామని స్పష్టం చేశారు.

గ్రామసభలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గంటా స్వాతి నరసయ్య, ఎంపీఓ. సంగీత, వార్డు సభ్యులు సందీప్, సతీష్, జగన్, జ్యోతి, గ్రామ నాయకులు, రేషన్ డీలర్లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, విద్యుత్ అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు