Homeక్రైమ్హైద‌రాబాద్‌లో ఘోరం...భార్య‌ను దారుణంగా హ‌త్య చేసిన భ‌ర్త‌...!

హైద‌రాబాద్‌లో ఘోరం…భార్య‌ను దారుణంగా హ‌త్య చేసిన భ‌ర్త‌…!

హైద‌రాబాద్, క్రైమ్ మిర్ర‌ర్ : అనుమానం పెనుభూత‌మై దాంప‌త్య జీవితం చిన్నాభిన్న‌మైంది. అనుమానంతో గొడ‌వ‌ప‌డి గొడ్డ‌లితో భార్య‌పై దాడి చేసి హ‌త‌మార్చిన ఘ‌ట‌న హైద‌రాబాద్ లో ఒక్క‌సారిగా క‌ల‌కలం రేపింది. మీర్‌పేట్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడకు చెందిన నర్సింహ(60), వసంత(56) దంపతులు కొంతకాలం క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి బీఎన్‌రెడ్డినగర్‌ సమీపంలోని టీచర్స్‌కాలనీలో నివసిస్తున్నారు.

వసంత ఇళ్లలో పనిచేస్తుండగా, నర్సింహ రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. కొంతకాలంగా నర్సింహ తన భార్యపై అనుమానం పెంచుకుని తరచుగా గొడవ పడుతున్నాడు. గ‌త రెండు రోజులుగా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్టు తెలిసింది. అనంతరం వసంత ఉదయం 5గంటల తర్వాత సమీపంలోని ఓ ఇంట్లో పని చేయడానికి వెళ్లి, అక్కడి నుంచి మరో ఇంటికి వెళ్తుండగా నర్సింహ ఆమెకు ఎదురెళ్లి గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తన వెంట తీసుకెళ్లిన గొడ్డలితో ఆమెపై దాడి చేశారు.

దాంతో ఆమె తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల ఫిర్యాదుతో మీర్‌పేట్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అనుమానమే ఈ హత్యకు కారణంగా భావిస్తున్నామని ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‏కుమార్‌రెడ్డి తెలిపారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు