Homeఅంతర్జాతీయంకొత్త రూపాన్ని సంతరించుకున్న కరోనా.. సికాడా వేరియంట్‌తో అలజడి

కొత్త రూపాన్ని సంతరించుకున్న కరోనా.. సికాడా వేరియంట్‌తో అలజడి

కరోనా వైరస్ పూర్తిగా కనుమరుగైందని భావిస్తున్న సమయంలో మళ్లీ కొత్త రూపంలో బయటపడడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతోంది. తాజాగా BA.3.2 అనే కొత్త ఉపరూపం గుర్తించబడింది. దీనికి సికాడా అనే పేరు పెట్టారు. అమెరికా, దక్షిణాఫ్రికా, యూరప్ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ఈ కొత్త రూపం పాత ఒమిక్రాన్ కుటుంబానికి చెందినదే అయినప్పటికీ సుమారు 70కి పైగా మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. ఇంత పెద్ద స్థాయిలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల ఇది వేగంగా వ్యాపించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ బయటపడిన ఈ వైరస్‌కు సికాడా అనే పేరు ఇవ్వడం జరిగింది.

ప్రస్తుతం ఈ వైరస్ లక్షణాలు పాత ఒమిక్రాన్ లక్షణాలకే దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీకా తీసుకున్న వారిలో తీవ్రమైన సమస్యలు తక్కువగానే కనిపిస్తున్నాయి. దగ్గు, గొంతు నొప్పి, అలసట, నీరసం, ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తున్నాయి. కొంతమందిలో తేలికపాటి జ్వరం కూడా ఉండవచ్చు. చాలా అరుదుగా వాసన, రుచి కోల్పోవడం లేదా రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వైరస్ పాత వేరియంట్ల కంటే కొంత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే కరోనా సోకిన వారు లేదా టీకాలు తీసుకున్న వారిలో ఉన్న రోగనిరోధక శక్తిని ఈ వైరస్ కొంతవరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అయినప్పటికీ ఈ కొత్త ఉపరూపం వల్ల ప్రమాదం పెరిగిందనే స్పష్టమైన ఆధారాలు లేవు. ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపించడం లేదు. సాధారణ జలుబు లేదా జ్వరంలా వచ్చి తగ్గిపోతున్న సందర్భాలే ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంకా బూస్టర్ టీకా తీసుకోని వారు తప్పకుండా తీసుకోవడం ద్వారా తీవ్రమైన అనారోగ్యాన్ని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం అవసరం. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఎక్కువ రోజులు కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. కరోనా పూర్తిగా అంతరించిపోలేదని, కొత్త కొత్త రూపాల్లో మారుతూ మన ముందు నిలుస్తోందని ఈ సికాడా రూపం మరోసారి గుర్తు చేస్తోంది. అయినప్పటికీ ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ముప్పు ఏమీ లేదని ఆరోగ్య సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

ALSO READ: మిగిలిపోయిన రైస్ పారేయకండి.. ఇలా పుదీనా రైస్ చేస్తే ప్లేటు ఖాళీ

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు