![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/IMG-20250210-WA0052.jpg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, వికారాబాద్:-కేటీఆర్కు దమ్ముంటే ధైర్యం ఉంటే కొడంగల్ లో ఒక బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీని,ఎంపీపీని గెలిపించుకోని చూపించు..రాజీనామా కు మా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అవసరం లేదు..నేను సిద్ధంగా ఉన్నానాని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కేటీఆర్ పై మండిపడ్డారు. కేటీఆర్ సవాళ్కు పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సోమవారం ఘాటుగా స్పందించి మాట్లాడారు.గతంలో నేను కేటీఆర్,హరీష్ రావు కు అసెంబ్లీలోనే రాజీనామా సవాల్ విసిరానని రాజీనామా పైన కేటీఆర్, హరీష్ రావు ఇప్పటి వరకు స్పందించలేదని అన్నారు.కేటీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మా అభ్యర్థులు కేకే,మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంటామని ధీమావ్యక్తం చేశారు.ఆరిపోయే దీపం లా కేటీఆర్ మాట్లాడుతున్నారని,జైలుకు పోతామన్న భయంతోనే ఊక దంపుడు ఉపన్యాసాలు చేస్తున్నాడని ఏద్దేవా చేశారు.హైదరాబాద్ నుంచి మనుషులను తీసుకెళ్లి దారి పొడువునా కేటీఆర్ షో చేస్తున్నాడని,పగటి వేషగాడి లా కేటీఆర్ మాటలున్నాయని విమర్శించారు.
డేంజర్.. వాటర్.. మిషన్ భగీరథ నీటీలో వానపాములు…!!
గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ నాడు కొడంగల్ ను పట్టించుకోలేదని,లక్ష రూపాయల రుణమాఫీ కూడా సరిగా చేయకుండా రైతులను దగా చేశారని ఆరోపించారు.కొడంగల్ యువతకు ఉపాధి కల్పించడం కోసం పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తుంటే బీఆర్ఎస్ దుష్పచారం చేసిందని మండిపడ్డారు.కలెక్టర్ ను చంపించడానికి సురేష్ అనే వ్యక్తితో ప్రయత్నం చేయించారని చెప్పారు.పారిశ్రామిక వాడ కోసం భూములు ఇవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా లేఖలు ఇస్తున్నారని,భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి 20 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నామన్నారు.అసైన్డ్ భూములకు కూడా ఎకరానికి 20 లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నారని చెప్పారు.ప్రతి రైతు కు అభివృద్ధి చేసిన 150 గజాల ప్లాట్ ఇస్తున్నామని,దీని వల్ల 15 లక్షలు భూములు ఇస్తున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాం..కుటుంబానికో ఉద్యోగం ఇస్తున్నామని అన్నారు.కొడంగల్ కు ఇప్పటికే మెడికల్ కాలేజ్ మంజూరు అయిందని .. ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేశామని చెప్పారు.అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేశామని,కొడంగల్ అభివృద్ధి కోసం 6,128 కోట్ల రూపాయలను కేటాయించామని అన్నారు.కొడంగల్ లో మా రేవంత్ రెడ్డిని ఓడించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అనేక శిలాఫలకాలు వేసి వదిలేసిందని విమర్శలు చేశారు.బీఆర్ఎస్ హయాంలో మా జిల్లాలో ఒక డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని,ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని ఏద్దేవా చేశారు.45 వేల కోట్లతో ఒకే రోజు నాలుగు పథకాలను మా ప్రభుత్వం తీసుకువచ్చిందని ధీమా వ్యక్తం చేశారు.కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతాడో తెలియదని,కేటీఆర్ చెల్లెలు ఇప్పటికే తీహార్ జైలుకు పోయి వచ్చిందని విమర్శించారు.
వేలం పాటలో 27 లక్షలకు సర్పంచ్ పదవి
కేటీఆర్ పైన ఎసీబీ, ఈడీ విచారణ జరుగుతోందని,కేటీఆర్ అబద్దాల పుట్ట అంటూ మండిపడ్డారు.మా సీఎం రేవంత్ రెడ్డి పైన మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదన్నారు.నా నియెజకవర్గంలో రుణమాఫీ పైన నేను ఛాలెంజ్ చేస్తే కేటీఆర్ నోరు మెదపలేదని,కేసీఆర్ చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ. పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా.. ఉప ఎన్నికలు ఉన్న చోట మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారు.వ్యవసాయం చేసే భూములకు రైతు భరోసా ఇస్తున్నాం. ఒక ఎకరం వరకు రైతు భరోసా పడింది. త్వరలో సాగు చేసే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తాం. పరిగి,వికారాబాద్,తాండూరు లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ఒక్క రేషన్ కార్డు ఇచ్చినట్లు చూపించండి.కేటీఆర్ కి రేవంత్ రెడ్డి అవసరం లేదు.. రామ్మోహన్ రెడ్డి చాలు.సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా కేటీఆర్ చేసి. ఎవరి పాలన బాగుందో ప్రజలు చెబుతారు. దమ్ముంటే రాజీనామా చెయ్యి ప్రజలు చెబుతారు. కొడంగల్ అభివృద్ది చూసి కేటీఆర్ కండ్లు మండుతున్నాయి. కేటీఆర్ కి దమ్ముంటే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.కొడంగల్ లో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పకుండా.. రైతులను రెచ్చగొడుతున్నారు” అని మండిపడ్డారు.
సినిమాను పైరసీ చేసిన వాళ్ళని వదిలిపెట్టం: తండేల్ మూవీ నిర్మాత