Homeఅంతర్జాతీయంసీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ...ఎందుకో తెలిస్తే షాక్..!

సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ…ఎందుకో తెలిస్తే షాక్..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మరియు మహిళా రిజర్వేషన్లపై నిన్న ఏప్రిల్ 14న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. లోక్‌సభ సీట్ల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగకూడదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ‘హైబ్రిడ్ మోడల్’ ద్వారా జాతీయ ఏకాభిప్రాయం సాధించాలని ఆయన సూచించారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టవద్దని కోరారు.

వీటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కీలక అంశాలపై అన్ని రాష్ట్రాలు మరియు రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. నియోజకవర్గాల పెంపులో ప్రస్తుతం ఉన్న ‘ప్రొ-రేటా’ (Pro-rata) విధానం దక్షిణాది ప్రజలకు ఆమోదయోగ్యం కాదని, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు వెళ్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని లేఖలో హెచ్చరించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు