Homeతెలంగాణశ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు..!

శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు..!

  • శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు..!

  • మొత్తం హుండీ ఆదాయం 48 వేల 549 రూపాయలు..

  • ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సదుపాయాల కోసం కృషి చేస్తాము

  • దేవాలయం చైర్మన్ బ్రేమ్మదేవరా విద్యాసాగర్ వెల్లడి

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వేములపల్లి, మార్చి 26: నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలోని శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం అధికారులు, దేవాలయం అర్చకులు మణిశర్మ, గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో హుండీని తెరిచి లెక్కింపు చేపట్టారు.

ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన నగదు, నాణేలు వంటి కానుకలను వేరు చేసి నమోదు చేశారు. దేవాలయం చైర్మన్ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారంగా… ఈసారి హుండీ ద్వారా 48 వేల 549 రూపాయల ఆదాయం లభించినట్లు తెలిపారు. గత సంవత్సరం జాతరలో 24 వేల 411 రూపాయల ఆదాయం లభించినట్లు తెలిసిందే.

శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు..!
శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు..!

అయితే ఇటీవల ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగడం వల్ల ఆదాయం కూడా రెట్టింపు గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు..

కార్యక్రమంలో దేవాదాయ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కొంకపాక మృతుంజయ్ శాస్రి, దేవాదాయ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి, గ్రామా సర్పంచ్ పిల్లల సందీప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు స్వరాజ్య లక్ష్మి, ధర్మకర్తలు లింగయ్య, జానీ, తదితరులు పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు