Homeఅంతర్జాతీయంబలూచిస్థాన్‌లో హిందూ వ్యాపారి దారుణ హత్య.. దుకాణంలోకి చొరబడి కాల్పులు

బలూచిస్థాన్‌లో హిందూ వ్యాపారి దారుణ హత్య.. దుకాణంలోకి చొరబడి కాల్పులు

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో హిందూ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. నుష్కీ పట్టణంలోని ఖాదిరాబాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాకేశ్ కుమార్ అనే వ్యాపారి తన దుకాణంలో ఉండగా గుర్తుతెలియని సాయుధులు లోపలికి చొరబడి కాల్పులు జరిపినట్లు సమాచారం.

పోలీసుల వివరాల ప్రకారం.. దుకాణంలోకి వచ్చిన దుండగులను రాకేశ్ కుమార్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో సాయుధులు ఆయనపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ హత్యకు దారితీసిన కారణాలు ఇప్పటివరకు స్పష్టంగా తెలియరాలేదు. దాడికి సంబంధించి ఏ సంస్థ కూడా బాధ్యత ప్రకటించలేదు.

ఈ ఘటనపై ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు గుర్పాల్ సింగ్ తీవ్రంగా స్పందించారు. హిందూ వ్యాపారిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఇది రాజ్య, బలూచిస్థాన్ వ్యతిరేక శక్తుల పిరికిపంద చర్యగా అభివర్ణించారు.

బలూచిస్థాన్‌లో హిందూ సమాజం శతాబ్దాలుగా అక్కడి సామాజిక జీవితంలో భాగంగా ఉందని గుర్పాల్ సింగ్ పేర్కొన్నారు. రాకేశ్ కుమార్ హత్యకు పాల్పడిన వారితో పాటు వారికి సహకరించిన వ్యక్తులను కూడా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బలూచిస్థాన్ ప్రభుత్వం, పోలీసు అధికారులను ఆయన కోరారు.

also read: హర్మూజ్‌లో చమురు ఆపేస్తాం.. అమెరికా మిత్రదేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు