2025లో జమ్మూకశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లష్కరే తోయిబా (LeT) వ్యవస్థాపకుడు, పాకిస్థాన్కు చెందిన హఫీజ్ సయీద్కు సమన్లు జారీ చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న సయీద్కు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ద్వారా సమన్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
జమ్మూలోని ప్రత్యేక NIA కోర్టు ఎదుట విచారణకు హాజరుకావాలని సమన్లలో ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే హఫీజ్ సయీద్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన కుట్రలో హఫీజ్ సయీద్ కీలక పాత్ర పోషించాడని NIA ఆరోపిస్తోంది. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS)-2023తో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)-1967 కింద వివిధ అభియోగాలు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
సయీద్ ప్రస్తుతం భారత దర్యాప్తు సంస్థల పరిధిలో లేకపోవడంతో, అతడికి సమన్లు అందించేందుకు దౌత్య మార్గాన్ని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
also read: వాట్సాప్లో ఆధార్, పాన్ పంపుతున్నారా? ఈ పొరపాటు చేస్తే సైబర్ మోసానికి బలయ్యే ఛాన్స్!
