కిష్త్వార్ జిల్లాలో శనివారం ఉదయం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దచ్చన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ స్కార్పియో వాహనం అదుపుతప్పి రోడ్డుపై నుంచి చీనాబ్ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
సమాచారం ప్రకారం.. హర్యానాలోని డాంగ్ దారు ప్రాంతం నుంచి సౌందర్ వైపు ప్రయాణిస్తున్న స్కార్పియో ప్రమాదానికి గురైంది. వాహనం నదిలో పడిపోవడంతో అందులో ఉన్నవారు ప్రమాదంలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి.
నదిలో నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ఈ దుర్ఘటనపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
also read: ఆకాశంలో మువ్వన్నెల జెండా.. డ్రోన్తో వినూత్న దేశభక్తి ప్రదర్శన
