Homeసినిమాతండ్రి చివరి సినిమా కోసం వెనక్కి తగ్గిన విజయ్ కొడుకు..!

తండ్రి చివరి సినిమా కోసం వెనక్కి తగ్గిన విజయ్ కొడుకు..!

క్రైమ్ మిర్రర్, సినిమా:- తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జన నాయగన్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో అడుగుపెట్టనున్న విజయ్‌కు ఇది చివరి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. ఇదే సమయంలో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న తొలి చిత్రం సిగ్మా విడుదలపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. జేసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న సిగ్మా సినిమాను తొలుత జూలై 31న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ మారే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తండ్రి విజయ్ చివరి సినిమా విడుదలైన వెంటనే తన సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద అనవసర పోటీ ఏర్పడే అవకాశం ఉందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

వెకేషన్‌లో ఐశ్వర్య రాజేష్.. ఒక్క ఫొటోతో నెట్టింట ఫన్నీ కామెంట్ల వర్షం!

జన నాయగన్ విజయ్ కెరీర్‌లో చివరి సినిమా కావడంతో తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు మొదటి వారం భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాంటి సమయంలో కొత్త దర్శకుడిగా జేసన్ సంజయ్ తెరకెక్కించిన సిగ్మా ను విడుదల చేస్తే ప్రేక్షకుల దృష్టి పూర్తిగా విజయ్ సినిమాపైనే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారట.దీంతో సిగ్మా చిత్రాన్ని ఆగస్టు నెలకు వాయిదా వేయాలని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఈ వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఇక సిగ్మా చిత్రంలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అయితే ప్రస్తుతం సిగ్మా విడుదల వాయిదా పడుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. విజయ్ చివరి సినిమా కోసం జేసన్ సంజయ్ నిజంగానే తన తొలి దర్శకుడి చిత్రాన్ని వాయిదా వేస్తారా? అనే అంశం ఇప్పుడు సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Amaravati Assigned Lands Case: సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు హైకోర్టు భారీ ఊరట.. CID కేసు రద్దు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు