ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: ఇష్టం లేని గర్బాన్ని కొనసాగించలేమంటూ ఓ 15 ఏళ్ల బాలికల కేసులో సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏడు నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు 15 ఏళ్ల బాలికకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇష్టం లేకుండా గర్భం కొనసాగించాలని ఒక మహిళను మరీ ముఖ్యంగా బాలికను బలవంతం చేయలేమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
అలా బలవంతం చేసే హక్కూ ఏ న్యాయస్థానానికి లేదని స్పష్టంచేసింది. పుట్టబోయే బిడ్డ కంటే గర్భం కొనసాగించే విషయంలో ఆ మహిళ తీసుకునే నిర్ణయానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇష్టం లేకుండా ఆ బాలిక తన గర్భాన్ని కొనసాగిస్తే అది ఆమె మానసిక ఆరోగ్యం, విద్యావకాశాలు, సామాజిక స్థితిగతులపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
ఒక బిడ్డకు జన్మనిచ్చే విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉండాలి. ఒక అవాంఛిత గర్భాన్ని కొనసాగించమని మహిళను ఒత్తిడి చేయడం అంటే.. ఆమె రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.