Homeక్రైమ్హైదరాబాద్‌లో ₹84.15 కోట్ల భారీ కుంభకోణం...!

హైదరాబాద్‌లో ₹84.15 కోట్ల భారీ కుంభకోణం…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్‌లో పాత ఇనుము, స్టీల్ వ్యాపారం పేరుతో జరిగిన ఈ ₹84.15 కోట్ల భారీ జీఎస్టీ (GST) కుంభకోణం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మార్చి 2026లో ఈ మోసాన్ని ఛేదించి, ప్రధాన నిందితుడు సందీప్ కుమార్ గోయల్‌ను అరెస్టు చేశారు.

సందీప్ కుమార్ గోయల్, ఎస్‌కేజీ (SKG) ట్రేడింగ్ కంపెనీ యజమాని. ఎలాంటి వస్తువులను సరఫరా చేయకుండానే కేవలం నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించి, భారీ ఎత్తున ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) పొందడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. విచారణలో నిందితుడు ఎస్‌కేజీ ట్రేడింగ్‌తో పాటు హెచ్‌ఎఫ్‌సీ (HFC) స్టీల్ ట్యూబ్స్ అండ్ వాల్వ్స్, విజయ్ ఇండస్ట్రియల్ నీడ్స్ ఎల్‌ఎల్‌పీ వంటి ఇతర సంస్థల ద్వారా కూడా ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.

ఈ అక్రమ సంస్థల జీఎస్టీ రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు. నిందితుడిని తెలంగాణ జీఎస్టీ చట్టం 2017 కింద అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. అధికారులు అందించిన వివరాల ప్రకారం, సవరించుకోవడానికి పలు అవకాశాలు ఇచ్చినప్పటికీ నిందితుడు స్పందించకపోవడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments