నేటి నుండి మూడు రోజులు భారీ వర్షాలు..!
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..
గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు..
చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదు
వాతావరణ శాఖ అధికారులు సూచనా..
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
నేటి నుండి వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగవచ్చు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ cహేశారు అధికారులు. గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు అని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, సాయంత్రం వేళల్లో చిరుజల్లులు పడవచ్చు అని తెలిపింది.
కావున వర్షం పడే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని అధికారులు ప్రజలను కోరుతున్నారు. రైతులు తమ ధాన్యం మరియు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
