క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు చాలా కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ రోజు (మార్చి 26) సాయంత్రం జరిగే ‘ఎదుర్కోలు’ ఉత్సవం సీతారాముల కల్యాణానికి ముందు జరిగే అత్యంత కీలకమైన ఘట్టం.
ఈ వేడుకలో పెళ్ళి కుమారుడి తరపు వారు, పెళ్ళి కుమార్తె తరపు వారు పరస్పరం వంశాభివర్ణన చేసుకుంటూ సాగే సంవాదం భక్తులను విశేషంగా అలరిస్తుంది. రేపు (మార్చి 27) మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి, ఆపై మార్చి 28న జరిగే మహా పట్టాభిషేకానికి భద్రాద్రి క్షేత్రం సర్వసన్నద్ధమైంది.
