Homeఅంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్: పదోవ తరగతి పరీక్షా వాయిదా..?

బ్రేకింగ్ న్యూస్: పదోవ తరగతి పరీక్షా వాయిదా..?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: రంజాన్ (ఈదుల్ ఫితర్) పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 మార్చి 21న జరగాల్సిన పదో తరగతి (SSC) ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేసింది. తొలుత మార్చి 20న రంజాన్ సెలవు ప్రకటించినప్పటికీ, నెలవంక కనిపించని కారణంగా పండుగను మార్చి 21న జరుపుకోవాలని వక్ఫ్ బోర్డు సూచించింది.

దీంతో ప్రభుత్వం సెలవు దినాన్ని మార్చి 21కి మార్చింది. వాయిదా పడిన ఇంగ్లీష్ పరీక్షను (పేపర్ కోడ్: 13E & 14E) ఏప్రిల్ 2, 2026 (గురువారం) నాడు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు.

ఈ మార్పు కేవలం ఇంగ్లీష్ పరీక్షకు మాత్రమే పరిమితం. మిగిలిన పరీక్షలు మునుపటి షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. విద్యార్థులు పాత హాల్ టిక్కెట్లనే ఉపయోగించి పరీక్షకు హాజరుకావచ్చు అని తెలిపారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు