క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల కొన్ని రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించి, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ప్రధానంగా సంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ సహా 10 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ అకాల వర్షాల వల్ల ముఖ్యంగా ఆరబోసిన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
