రంగారెడ్డి,క్రైమ్ మిర్రర్:- రంగారెడ్డి జిల్లా, మాడ్గుల మండలం కొలుకులపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఇన్నోవాన్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద పాఠశాలకు 70 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ నిధులతో సమీప గ్రామాల నుంచి పాఠశాలకు వచ్చే బాలికల కోసం సైకిళ్లు పంపిణీ చేయడం జరిగింది. దీంతో విద్యార్థినుల ప్రయాణ సౌకర్యం మెరుగుపడింది.
అదేవిధంగా పాఠశాలలో ఉన్న బోర్వెల్కు కొత్త మోటార్ అమర్చడంతో నీటి సమస్యకు పరిష్కారం లభించిందన్నారు.
వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేసవి శిక్షణ శిబిరం ఈసారి జిల్లా పరిషత్ హై స్కూల్, కొలుకులపల్లిలో జరగనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శిబిరానికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కొలుకులపల్లి గ్రామ సర్పంచ్ బట్టు అనురాధ మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బట్టు కిషన్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సువర్ణ లక్ష్మి ,ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించాలి : మున్సిపల్ కమిషనర్
Politics: ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డికి ఎదురుపడ్డ మాజీ మంత్రి రోజా
