Saturday, March 28, 2026
Homeజాతీయం(VIDEO): ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని భారత ప్రధానిని అడిగిన పాకిస్థాన్ మహిళ.. తర్వాత ఏమైందంటే?

(VIDEO): ‘నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని భారత ప్రధానిని అడిగిన పాకిస్థాన్ మహిళ.. తర్వాత ఏమైందంటే?

నేడు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ఆయన వ్యక్తిత్వం, వాక్చాతుర్యం, దేశభక్తిని మరోసారి గుర్తు చేసుకునే సందర్భం ఏర్పడింది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. వాజ్‌పేయితో తనకు సంబంధించిన ఒక ఆసక్తికర సంఘటనను ప్రస్తావిస్తూ సభికులను ఆకట్టుకున్నారు.

ఢిల్లీలో వాజ్‌పేయి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఒకసారి అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ పర్యటనలో వాజ్‌పేయి చేసిన ప్రసంగాలు అక్కడి ప్రజలను, ముఖ్యంగా ఒక పాకిస్థాన్ మహిళను బాగా ఆకట్టుకున్నాయని తెలిపారు. ఆ మహిళ నేరుగా వాజ్‌పేయి వద్దకు వచ్చి ఊహించని విధంగా ‘నన్ను పెళ్లి చేసుకుంటారా? దానికి బదులుగా కశ్మీర్‌ను ఇస్తారా?’ అంటూ ప్రశ్నించిందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

ఆ ప్రశ్నకు వాజ్‌పేయి ఇచ్చిన సమాధానం ఆయన అసాధారణమైన వాక్చాతుర్యానికి నిదర్శనమని చెప్పారు. ‘నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే, కానీ కట్నంగా పాకిస్థాన్ కావాలి’ అని వాజ్‌పేయి సమాధానం ఇవ్వడంతో ఆ మహిళ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయిందని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన వాజ్‌పేయి హాస్యబుద్ధితో పాటు దేశ సమగ్రతపై ఆయనకు ఉన్న అచంచలమైన నిబద్ధతను చాటిచెప్పిందని ఆయన అన్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రసంగ శైలి ప్రత్యేకమని, రాజకీయ ప్రత్యర్థులను విమర్శించే సమయంలో కూడా ఆయన ఎప్పుడూ సంస్కారాన్ని, హద్దులను దాటలేదని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. రాజకీయాల్లో తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగత ద్వేషానికి ఆయన ఎప్పుడూ తావివ్వలేదని చెప్పారు. అదే ఆయనను ఇతర నాయకులకంటే భిన్నంగా నిలబెట్టిందని వ్యాఖ్యానించారు.

బీజేపీ విస్తరణను చూసి వాజ్‌పేయి ఎంతో ఆనందించేవారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పార్టీ ఎదుగుతున్న కొద్దీ తన కుటుంబం పెరుగుతోందని భావిస్తూ ఆయన గర్వపడేవారని, ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిలా చూసేవారని అన్నారు. అటువంటి మహానాయకుడి జయంతి సందర్భంగా ఆయన స్మృతులను గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుడికి గౌరవప్రదమైన విషయమని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

ALSO READ: VIDEO: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. ఊహించని పని చేసిన ఇద్దరమ్మాయిలు

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments