Homeఆంధ్ర ప్రదేశ్అన్నదాతలకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు పడేది ఎప్పుడంటే?

అన్నదాతలకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు పడేది ఎప్పుడంటే?

Annadata Sukhibhava: రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ పథకం అమలుపై అధికారులకు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగష్టు 2 నుంచి ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు చెప్పారు. అదే రోజు పీఎం కిసాన్ పథకం నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. కేంద్రం ఇచ్చే రూ. 6 వేలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 14 వేలు అందివ్వనుంది.

ఏడాదికి రైతుల ఖాతాలోకి రూ. 20 వేలు జమ

‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఏడాదికి రైతుకు రూ. 14 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఈ డబ్బులను మూడు విడుతలుగా అందివ్వనుంది. మొదటి విడతలో రాష్ట్రం వాటా రూ.5,000 జమ చేయనుంది. ఆగస్టు 2న ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ఏపీ సర్కారు వెల్లడించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లాభం జరగనుంది. ఇందుకోసం రూ.2,342.92 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆగస్టు 2న ప్రకాశం జిల్లా దర్శిలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

Read Also: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు