Homeజాతీయంలక్ష దాటేసిన బంగారం ధర.. ఇవాళ తులం ధర ఎంతంటే?

లక్ష దాటేసిన బంగారం ధర.. ఇవాళ తులం ధర ఎంతంటే?

Gold and Silver Rates Today: బంగారం ధర మళ్లీ లక్ష రూపాయులు దాటింది. నిన్న మొన్నటి వరకు 98 వేలు పలికిన తులం బంగారం.. ఇవాళ లక్షకు చేరింది. ఇవాళ ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 1, 00, 040కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91, 700 పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

ఇవాళ ఉదయం ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 00, 190కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర  10 గ్రాములకు రూ. 91, 850 పలుకుంది. హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,040కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 91,700 పలుకుంది. అటు వెండి ధరలకు కూడా స్వల్పంగా పెరిగాయి.  హైదరాబాద్‌, విజయవాడ, చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,26,000గా పలుకుతోంది. కోల్ కతా, ముంబై, బెంగళూరు సహా పలు నగరాల్లో రూ.1, 16,000 పలుకుతోంది.

అంతర్జాతీయ పరిస్థితులు, అమెరికా సుంకాల భయంతో బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. వీటి మీద పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండి రేట్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.

Read Also: రైతులకు అందని పీఎం కిసాన్ డబ్బులు, కారణం ఏంటంటే?

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు