HomeజాతీయంManchu Lakshmi: అది తల్చుకుని కిందపడి ఏడ్చా

Manchu Lakshmi: అది తల్చుకుని కిందపడి ఏడ్చా

Manchu Lakshmi: పదిహేనేళ్ల వయసులో తన జీవితాన్ని బాగా కలిచిమేసిన ఒక చేదు అనుభవం ఉందని నటి మంచు లక్ష్మి ఇటీవల వెల్లడించింది. బయటకు ఎప్పుడూ ధైర్యంగా కనిపించే ఆమె మనసులో ఇంత బాధ దాగి ఉందని చాలా మంది ఊహించలేదు. హాటర్‌ఫ్లైకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ చాలా భావోద్వేగంతో మాట్లాడింది. ఆ సమయంలో తాను పదో తరగతి చదువుతున్నానని, రోజూ స్కూలుకు కారులోనే వెళ్లేదానినని, తన వెంట తల్లి, డ్రైవర్‌, బాడీగార్డ్‌ ఎప్పుడూ ఉంటారని చెప్పింది. చిన్నప్పటి నుంచి రక్షణలోనే పెరిగిన ఆమెకు వాహనాలే అలవాటు కావడంతో సాధారణ బస్‌ ప్రయాణం చేయడం కూడా ఓ కొత్త అనుభవమే.

ఒకసారి స్కూల్‌ హాల్‌ టికెట్లు తీసుకోవడానికి టీచర్లు వారిని పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో తీసుకెళ్లారని చెప్పింది. సాధారణ ప్రయాణం చేయబోతున్నానన్న ఆనందంతో తాను ఎంతో ఎగ్జయిట్‌ అయ్యానని, అది మంచి అనుభవమవుతుందని భావించినట్టుగా చెప్పింది. కానీ ఆ ప్రయాణమే ఆమె జీవితంలో ఎన్నో సంవత్సరాల పాటు మర్చిపోలేని క్షణంగా మారింది. బస్సులో ఉన్నప్పుడు ఓ వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని, ఆ షాక్‌ నుండి వెంటనే కోలుకోలేకపోయానని చెప్పింది. తాను చిన్నపిల్లనని అతనికి తెలుసా లేదా అన్నది కూడా అర్థం కాలేదని, అలాంటి దుర్మార్గపు ప్రవర్తన తనకు తీవ్ర అసహ్యాన్ని కలిగించిందని గుర్తుచేసుకుంది.

వెంటనే గొడవ పెట్టుకునే ధైర్యం రాలేదని, భయంతో పక్కకు తప్పుకోడం తప్ప ఇంకేం చేయలేకపోయానని చెప్పింది. ఆ తరువాత జరిగినదాన్ని తన స్నేహితులకు చెప్పగానే వారు కూడా ఇలాంటి వేధింపులు తరచూ ఎదుర్కొంటున్నామని చెప్పడం తనను మరింత కుంగదీసిందని మంచు లక్ష్మి వెల్లడించింది. ‘‘నేను మోహన్‌బాబు కూతుర్ని కాబట్టి ఈ ప్రపంచం నన్ను ప్రత్యేకంగా కాపాడుతుందని అనుకున్నాను. కానీ నిజానికి అసలు ప్రపంచం ఎవ్వరినీ విడిచిపెట్టదు’’ అని చెప్పింది. ఇలాంటి అనుభవాలు చాలా మందికి జరుగుతాయని, కానీ బయటకు అంగీకరించడానికి చాలా మంది సంకోచిస్తారని ఆమె పేర్కొంది.

ALSO READ: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 3Dలోనూ అఖండ-2

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు