Homeఆంధ్ర ప్రదేశ్ప్రేమా...? మోజా...? ప్రతీకారమా...?

ప్రేమా…? మోజా…? ప్రతీకారమా…?

  • ప్రేమా…? మోజా…? ప్రతీకారమా…?

  • తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న వివాహేతర సంబంధాల హత్యలు

వివాహం అనేది ఒకప్పుడు జీవితాంతం నిలిచే బంధంగా భావించేవారు. ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు… రెండు కుటుంబాలు కలిసే బంధం. కానీ ఇప్పుడు అదే బంధం అనుమానాలు, విభేదాలు, కొత్త ఆకర్షణల మధ్య బలహీనమవుతోంది.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వెలుగులోకి వస్తున్న హత్య కేసుల్లో ఒకే విషయం ఎక్కువగా కనిపిస్తోంది — వివాహేతర సంబంధాలు. ప్రేమగా మొదలైన బంధాలు… అనుమానాలుగా మారి… చివరకు హత్యలతో ముగుస్తున్నాయి.

ప్రేమా...? మోజా...? ప్రతీకారమా...?
ప్రేమా…? మోజా…? ప్రతీకారమా…?

ఒక చోట భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన భార్యే హత్యకు కారణమైంది. ఇంకో చోట ప్రియుడి కోసం చిన్నారినే అడ్డుగా భావించి చంపేశారు. మరో కేసులో కొత్తగా పెళ్లైన మహిళ తన పాత సంబంధం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఇవన్నీ వేర్వేరు ఘటనలు కాదు… ఒకే ప్రమాదకర ట్రెండ్.

ఎందుకు జరుగుతున్నాయి ఈ హత్యలు?

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ హత్యలకు ప్రధాన కారణాలు భావోద్వేగ అసంతృప్తి, అనుమానం, అసూయ, భాగస్వామిపై అధిక స్వాధీన భావం, సోషల్ మీడియా ద్వారా పెరిగిన పరిచయాలు, కుటుంబ సమస్యలను మాట్లాడుకోకపోవడం. విడాకులు అనే చట్టబద్ధమైన మార్గం ఉన్నా… చాలామంది ఎందుకు హత్యల దారి పడుతున్నారు అంటే, “నాతో ఉండాలి… లేదంటే ఎవరితోనూ ఉండకూడదు” అనే స్వార్థ ఆలోచన ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ప్రమాదకర మానసిక స్థితి

సైకాలజిస్టులు చెబుతున్నదేమిటంటే… ఈ హత్యలు ఒక్కసారిగా కోపంతో జరగవు. ముందే మానసికంగా ఆలోచనలు మొదలవుతాయి. “అతడు లేకపోతే బాగుంటుంది”, “ఆమె అడ్డుగా ఉంది” అనే భావనలు క్రమంగా హింసకు దారి తీస్తాయి.

సోషల్ మీడియా ప్రభావం

ఇప్పటి కాలంలో మొబైల్ ఫోన్లు, చాటింగ్ యాప్స్ వల్ల పాత పరిచయాలు మళ్లీ దగ్గరవడం, రహస్య సంబంధాలు పెరగడం, అనుమానాలు ఎక్కువ కావడం లాంటివి కుటుంబాల్లో గొడవలకు దారి తీస్తున్నాయి.

పిల్లలే పెద్ద బాధితులు

ఈ ఘటనల్లో ఎక్కువ నష్టపోతున్నది పిల్లలే. భార్య నీ భర్త చంపడం, భర్త నీ భార్య చంపడం… ఇందులో ఒకరు చనిపోతారు, మరొకరు జైలుకు వెళ్తారు చివరకి పిల్లలు అనాథలవుతారు. ఒక తప్పు నిర్ణయం… తరాల భవిష్యత్తును నాశనం చేస్తోంది.

పెరుగుతున్న కేసులు

2026 మొదటి ఐదు నెలల్లోనే తెలుగు రాష్ట్రాల్లో వరుస హత్యలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి కొన్ని వారాలకు ఒక కేసు బయటపడుతోంది. పోలీసుల అంచనా ప్రకారం 20–25% హత్యలు ప్రేమ, కుటుంబ విభేదాల కారణంగానే జరుగుతున్నాయి.

పరిష్కారం ఏమిటి?

సమస్యలు ఉంటే మాట్లాడుకోవడం, కౌన్సెలింగ్, చట్టబద్ధంగా విడిపోవడం లాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అంతేకానీ కోపంతో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేస్తాయి.

వివాహేతర సంబంధం కేవలం వ్యక్తిగత విషయం కాదు… అది కుటుంబాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే సమస్య.
ప్రేమ పేరుతో మొదలైన బంధం… హింసతో ముగియకూడదు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు