HomeజాతీయంVande Bharat Sleeper: పట్టాలెక్కబోతున్న వందేభారత్ స్లీపర్, ఫస్ట్ ఏ రూట్ లో నడుస్తుందంటే?

Vande Bharat Sleeper: పట్టాలెక్కబోతున్న వందేభారత్ స్లీపర్, ఫస్ట్ ఏ రూట్ లో నడుస్తుందంటే?

First Vande Bharat Sleeper: దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందేభారత్‌ రైలు స్లీపర్‌ రైలు త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లతో కూడిన రైలును ప్రధాని మోడీ చేతుల మీదుగా తర్వలో ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

ఫస్ట్ రైలు ఏ రూట్ లో నడుస్తుందంటే?

వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించి ట్రయల్ రన్ సహా ఇతర పరీక్షలు అన్నీ పూర్తయ్యాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు.  తొలి స్లీపర్‌ రైలును గౌహతి-కోల్‌కతా మధ్య నడపనున్నట్లు వెల్లడించారు. “చాలా రోజులుగా కొత్త జనరేషన్‌ వందేభారత్‌ రైళ్ల కోసం ప్రయాణికుల నుంచి డిమాండ్‌ ఉంది. భారతీయ రైల్వేలో వందేభారత్‌ చైర్‌ కార్‌ రైళ్లతో కొత్త శకం ఆరంభమైంది. ఈ రైళ్లను ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు. వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని స్లీపర్‌ కోచ్‌లతో కూడిన వందేభారత్‌ రైళ్లను రూపొందించాం. అధునాతన భద్రతా ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయి స్లీపర్‌ కోచ్‌లతో ఈ రైళ్లను సిద్ధం చేశాం” అని వైష్ణవ్‌ వివరించారు.

మధ్య తరగతి ప్రయాణీకులకు అందుబాటులో ధరలు

అటు వందే భారత్ స్లీపర్ రైలు టికెట్‌ ధరలు కూడా మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయిస్తున్నామని తెలిపారు. గౌహతి-హౌరా మధ్య ప్రయాణానికి 3ఏసీ టికెట్‌ ధర రూ.2300గా ఉండొచ్చని తెలిపారు. దేశంలో తొలి బుల్లెట్‌ రైలు ట్రైల్‌ రన్‌ను 2027 ఆగస్టు 15న నిర్వహిస్తామని వెల్లడించారు. ముందుగా సూరత్‌-బిలిమోరా మార్గంలో బుల్లెట్‌ రైలు సిద్ధమవుతుందని ఆయన తెలిపారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు