Homeతెలంగాణగ్యాస్ కు ఎందుకు ఎక్కువ వసూలు చేస్తున్నారు..!

గ్యాస్ కు ఎందుకు ఎక్కువ వసూలు చేస్తున్నారు..!

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్

క్రైమ్ మిర్రర్, మునుగోడు: గ్యాస్ కు నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు తధ్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం నాడు ఆయన నల్గొండ జిల్లా మునుగోడు లో గ్యాస్ కు అధికంగా వసూలు చేస్తున్న సాయి దుర్గ గ్యాస్ ఏజెన్సీ కి వారి ని నిలదేశారు.

ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..గరిష చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేసే గ్యాస్ మాఫియా పై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండ లో గ్యాస్ వినియోగదారులను నిరీక్షణ చేయించడం భావ్యం కాదని మాచన రఘునందన్ స్పష్టం చేశారు.

గ్యాస్ తమకు డోర్ డెలివరీ కావడం లేదు,అధికంగా వసూలు చేస్తున్నారు.అని పలువురు ఆరోపణ చేయగా వారి నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు తీసుకున్నారు.గ్యాస్ డెలివరీ సమయం లో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని రఘునందన్ వినియోగదారులకు స్పష్టం చేశారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు