Homeక్రైమ్27 ఏళ్ల మహిళ దారుణ హత్య..!

27 ఏళ్ల మహిళ దారుణ హత్య..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంజి: నిర్మల్ జిల్లా భైంసాలో 27 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురికావడం తో కలకలం రేగింది.భైంసా పట్టణంలోని సంతోషిమాత ఆలయం సమీపంలో ఉన్న నందన టీ పాయింట్‌లో ఈ హత్య జరిగినట్లు తెలుస్తుంది. స్తనికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

మృతురాలి పేరు అశ్విని (30), కుంసర గ్రామానికి చెందిన ఆమె భర్తతో విడాకులు తీసుకుని ఉపాధి కోసం టీ పాయింట్‌ను నడుపుతు  ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో భైంసాలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నగేష్ అనే వ్యక్తితో అశ్వినికి పరిచయం ఏర్పడి, కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.

అశ్విని తనతో ఉంటూనే మరో వ్యక్తితో సన్నిహితంగా మాట్లాడుతుందని నగేష్ అనుమానించాడు. ఈ అనుమానంతోనే అతను టీ పాయింట్‌లో ఆమెను కత్తితో పొడిచి, రాడ్డుతో దాడి చేసి ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. నగేష్ హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోకుండా మృతదేహం పక్కనే కూర్చున్నాడు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడి కానున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు