Homeతెలంగాణలక్ష్మీదేవిగూడెంలో ఎన్నికల ప్రచార వేగం పెంచిన ఉంగరం అభ్యర్థి భరత్

లక్ష్మీదేవిగూడెంలో ఎన్నికల ప్రచార వేగం పెంచిన ఉంగరం అభ్యర్థి భరత్

క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిధి: మిర్యాలగూడ నియోజకవర్గం, వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి ఎలికేటి భరత్ ప్రచారాన్ని మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆశీర్వాదంతో గ్రామంలో పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు సాగుతున్న భరత్, ప్రచారంలో భాగంగా సోమవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి లక్ష్మీదేవిగూడెం గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించారు.

అనంతరం భరత్ గ్రామ ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, సేవ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. తనకు గ్రామ ప్రజల నుండి లభిస్తున్న మద్దతు ప్రచారానికి మరింత ఉత్సాహాన్నిస్తోందని భరత్ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ‘ఉంగరం’ గుర్తుపెట్టుకోవాలని ఆయన ఇంటింటా ప్రచారం ద్వారా కోరారు. అన్ని వర్గాల ప్రజలతో కలిసిపోతూ, అభివృద్ధి పరమైన హామీలతో ముందుకు సాగుతున్న భరత్ ఇతర అభ్యర్థులతో పోలిస్తే ప్రచారంలో ముందంజలో ఉన్నారనే విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది…

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు