క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ :- ఆసియన్ గేమ్స్లో పాల్గొన్న భారత మహిళల క్రికెట్ జట్టు ధరించిన జెర్సీలపై బీసీసీఐ లోగో కనిపించకపోవడం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జెర్సీలపై కేవలం ‘INDIA’ తో పాటు స్పాన్సర్ ‘JSW’ లెటర్స్ మాత్రమే కనిపించడంతో, అసలు బీసీసీఐ లోగో ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, ఫ్యాన్స్ పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు.అయితే, దీని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆసియన్ గేమ్స్ అనేది ఒక అధికారిక మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్. ఈ టోర్నమెంట్లో టీమిండియా నేరుగా బోర్డు తరఫున కాకుండా, ‘ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్’ (IOA) ఆధ్వర్యంలో బరిలోకి దిగుతుంది. ఈ కారణంగానే అక్కడ ఐఓఏ నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయి. ఒలింపిక్స్ మరియు ఆసియన్ గేమ్స్ నిబంధనావళి ప్రకారం, ఆయా సంఘాల నిర్దేశిత లోగోలు మరియు వాటి అధికారిక స్పాన్సర్ల లోగోలు మాత్రమే జెర్సీలపై ప్రదర్శించడానికి అనుమతి ఉంటుంది. అందుకే ఈసారి భారత మహిళా జట్టు జెర్సీలపై బీసీసీఐ లోగో స్థానంలో ఐఓఏ నిబంధనలకు తగు విధంగా లోగోలు ముద్రించబడ్డాయి. ఈ కొత్త జెర్సీ డిజైన్ మరియు నిబంధనలపై మీ అభిప్రాయం ఏమిటి?
ఏపీలో వైభవంగా నంది అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం..
సాయంత్రం ఏ సమయంలో టీ తాగితే ఆరోగ్యానికి మంచిది? నిపుణులు చెబుతున్న ఆసక్తికరమైన విషయాలు ఇవే!
