బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి ఆశా సింగ్ జైస్వాల్ కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఆశా సింగ్ జైస్వాల్ మృతి విషయాన్ని ఆమె కుమారుడు ఆకాశ్ సింగ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో సినీ వర్గాల్లో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.
సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా ఆశా సింగ్ జైస్వాల్ తనదైన ముద్ర వేశారు. ‘తేరీ తలాష్ మే’, ‘బాజీగర్’, ‘పెచైన్’ వంటి పలు చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా పలు టీవీ సీరియల్స్లోనూ నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
దీర్ఘకాలంగా నటిగా కొనసాగిన ఆశా సింగ్ జైస్వాల్ మరణంతో ఆమె అభిమానులు, సినీ ప్రేక్షకులు విషాదంలో మునిగిపోయారు.
also read: ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. ఐదు పేజీల మరణ వాంగ్మూలంలో సంచలన విషయాలు
