ప్రముఖ బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ నటించిన విమల్ ఇలాయిచి ప్రకటన వివాదంలో చిక్కుకుంది. ఈ ప్రకటన ద్వారా పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ముగ్గురు నటులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.మహారాష్ట్రలో పాన్ మసాలా తయారీ, విక్రయాలు, నిల్వపై నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో విమల్ ఇలాయిచి ప్రకటనపై ఎఫ్డీఏ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. యాడ్లో నేరుగా పాన్ మసాలా పేరును ప్రస్తావించకపోయినా, ఆ బ్రాండ్ను పరోక్షంగా గుర్తు చేసే విధంగా ప్రచారం జరుగుతోందని అధికారులు భావించినట్లు సమాచారం. దీంతో ప్రకటనలో భాగమైన నటుల నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది.నోటీసుల ప్రకారం యాడ్కు సంబంధించిన ప్రచార కంటెంట్ను సోషల్ మీడియా నుంచి తొలగించడంతో పాటు, ఎండార్స్మెంట్కు సంబంధించిన ఒప్పంద వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం. ఇందుకోసం నటులకు 15 రోజుల గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారు ఇచ్చే వివరణను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రూ.1.5 కోట్ల ‘బాస్ స్కామ్’ వెనుక అంతర్జాతీయ సైబర్ ముఠా.. 4,500 సిమ్ కార్డులు స్వాధీనం
ఈ వ్యవహారంపై ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే స్పందించినట్లు సమాచారం. ఆహార భద్రత, ప్రమాణాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించే ప్రకటనల విషయంలో తయారీదారులు, స్పాన్సర్లు, ప్రచారకర్తలు వంటి సంబంధిత వర్గాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఎవరిపైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమనే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో జరిమానా విధించే అంశం కూడా చర్చకు వస్తోంది. నటులు ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఒక్కొక్కరిపై రూ.10 లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే తుది నిర్ణయం విచారణ అనంతరం సంబంధిత అధికారులు తీసుకోవాల్సి ఉంటుంది.మరోవైపు ప్రముఖుల ప్రకటనలపై చట్టపరమైన బాధ్యత ఎంతవరకు ఉంటుందనే చర్చ కూడా మొదలైంది. ముఖ్యంగా నిషేధిత ఉత్పత్తులను పరోక్షంగా ప్రచారం చేసే ప్రకటనల్లో సెలబ్రిటీల పాత్రపై భవిష్యత్తులో మరింత కఠినమైన నిబంధనలు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్లు నోటీసులకు ఇచ్చే సమాధానంపై తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయి.
మూడో కాన్పుకూ 365 రోజుల ప్రసూతి సెలవు.. మహిళా ఉద్యోగులకు తమిళనాడు సర్కార్ గుడ్న్యూస్
