క్రైమ్ మిర్రర్, సినిమా:- ప్రస్తుతం సినిమాలకు సోషల్ మీడియా ప్రమోషన్స్ ఎంతో కీలకంగా మారాయి. ఒక ఆసక్తికరమైన పోస్టర్ లేదా టీజర్తోనే ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచే అవకాశం ఉంది. అలాంటి ఆసక్తిని క్రియేట్ చేసిన చిత్రాల్లో హుషార్ పిట్టలు కూడా ఒకటి. విడుదలకు ముందు వచ్చిన టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై యువతలో ఆసక్తిని పెంచాయి.బోల్డ్ టీనేజ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైంది. యూత్ఫుల్ ఎలిమెంట్స్తో పాటు కుటుంబ భావోద్వేగాలు, సామాజిక అంశాలను కూడా కథలో మిళితం చేసినట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు బిక్షు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, అన్షు, వాసవి గణేషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. టీనేజ్ వయసులో ఎదురయ్యే ఆకర్షణలు, వాటి ప్రభావం, కుటుంబంలో ఏర్పడే పరిస్థితులను కథలో చూపించినట్లు సమాచారం.ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఓటీటీ విడుదల. హుషార్ పిట్టలు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ విడుదల తర్వాత సుమారు మూడు నుంచి నాలుగు వారాల వ్యవధిలో సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన సెప్టెంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రియా భవానీ శంకర్ షాకింగ్ కామెంట్స్..!
కథ విషయానికి వస్తే తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. రవి అనే టీనేజ్ కుర్రాడు చదువుల్లో ముందుండే విద్యార్థి. అయితే స్నేహితుల ప్రభావంతో అతడి ఆలోచనా విధానంలో మార్పులు వస్తాయి. మరోవైపు తొమ్మిదో తరగతి చదువుతున్న చిట్టి రవిపై ఆకర్షితురాలవుతుంది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం అనుకోని పరిస్థితులకు దారితీస్తుంది.ఓ సందర్భంలో ఇద్దరూ తమ తల్లిదండ్రులకు చిక్కడంతో కథలో కీలకమైన మలుపు వస్తుంది. ఆ తర్వాత పిల్లల పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు ఎలా స్పందించారు? వారి నిర్ణయాలు యువత జీవితాలను ఎలాంటి మలుపు తిప్పాయి? చిన్న వయసులో తీసుకున్న నిర్ణయాల ప్రభావం వారి భవిష్యత్తుపై ఎలా పడింది? అనే అంశాల చుట్టూ కథ కొనసాగుతుంది. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అధికారిక స్ట్రీమింగ్ తేదీపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సంధ్య థియేటర్ కేసులో కీలక పరిణామం.. తదుపరి విచారణ ఎప్పుడంటే?
