కుప్పం, క్రైమ్మిర్రర్: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ చీరల రాధ గురువారం అర్ధరాత్రి కుప్పం రైల్వే స్టేషన్లో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త బెట్టింగ్ కు బానిసై రూ.లక్షలు నష్టపోవడంతో కుటుంబంలో తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పులు తీర్చేందుకు పుట్టింటివారు రూ.40 లక్షలు సాయం చేసినా భర్తలో మార్పు రాలేదు.
Also Read:సరిహద్దు దాటే ప్రయత్నం విషాదాంతం.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వలసదారులు
దీంతో సమస్యను పెద్దలతో చర్చించేందుకు బెంగళూరు నుంచి వస్తున్న సమయంలో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆమె బ్యాగులో సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు
