ఉత్తర్ప్రదేశ్లోని వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్లో ఓ భారీ ప్రమాదం తృటిలో తప్పింది. నిజాముద్దీన్– జబల్పూర్ ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్ నుంచి బయలుదేరుతున్న సమయంలో మధ్యప్రదేశ్కు చెందిన రమేశ్ జైన్ అనే ప్రయాణికుడు స్లీపర్ కోచ్ నుంచి దిగేందుకు ప్రయత్నించాడు.
అయితే రైలు కదులుతున్న వేళ అతడు సమతుల్యత కోల్పోయి రైలు, ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోవడానికి దగ్గరయ్యాడు. ఈ ఘటన క్షణాల్లోనే జరిగిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న రైల్వే కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముందుకు దూసుకెళ్లి, ప్రమాదంలో పడిపోతున్న ప్రయాణికుడిని బలంగా పట్టుకుని పైకి లాగి సురక్షితంగా కాపాడారు. ఆయన చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటన మొత్తం స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ ధైర్యసాహసాలను రైల్వే అధికారులు అభినందించారు.
గమనిక:
కదులుతున్న రైళ్లలో ఎక్కడం, దిగడం అత్యంత ప్రమాదకరం. ప్రయాణికులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
also read: హైదరాబాద్లో ఘోరం: స్నేహితుల చేతిలో యువకుడి హత్య- ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేసి మరీ దారుణం