హైదరాబాద్, క్రైమ్మిర్రర్: మొబైల్ వినియోగదారులకు మరోసారి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, విద్యుత్, గ్యాస్, ఇతర సేవల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు ఇప్పుడు టెలికం కంపెనీలు కూడా అదనపు భారం మోపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ పరిశోధనా సంస్థ Centrum Institutional Research విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు 12 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Also Read:లెనిన్’ చిత్రానికి ఎన్టీఆర్ పవర్ఫుల్ వాయిస్…!
ఈ ధరల పెంపుతో నెలవారీ మొబైల్ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రీపెయిడ్ వినియోగదారులపై దీని ప్రభావం క్కువగా ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. టెలికం సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు, భవిష్యత్ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా నెట్వర్క్ను మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. 4G, 5G సేవల విస్తరణకు భారీ పెట్టుబడులు అవసరమవుతున్న నేపథ్యంలో టెలికం కంపెనీలు టారిఫ్లను పెంచే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడే వరకు వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.
Also Read:నిజామాబాద్లో దారుణం….! ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య…!
దేశవ్యాప్తంగా 4G, 5G నెట్వర్క్ వినియోగం వేగంగా పెరుగుతోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో డేటా వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుతున్న డిమాండ్ను తట్టుకునేందుకు టెలికం కంపెనీలు నెట్వర్క్ విస్తరణ, టవర్లు, స్పెక్ట్రం, సాంకేతిక మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ఖర్చును భర్తీ చేయడానికే టారిఫ్ పెంపు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, టెలికం రంగంలో కీలక సూచికగా భావించే ARPU (Average Revenue Per User) ప్రస్తుత త్రైమాసికంలో 1 నుంచి 1.5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అయినప్పటికీ కంపెనీల దీర్ఘకాలిక లాభదాయకత కోసం ARPU మరింత పెరగాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read:ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఖాతాల్లోకి వడ్డీ జమ
ఈ నేపథ్యంలో రానున్న పండుగల సీజన్ లేదా తదుపరి త్రైమాసికంలో ప్రముఖ టెలికం కంపెనీలు కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటిస్తూ ధరలు పెంచే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఏ టెలికం సంస్థ కూడా అధికారికంగా టారిఫ్ పెంపును ప్రకటించలేదు. కాబట్టి వినియోగదారులు అధికారిక ప్రకటనలపై దృష్టి ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.