హైదరాబాద్, క్రైమ్మిర్రర్: కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమీన్పూర్లోని ఓ హోటల్లో మూసాపేట్కు చెందిన లక్ష్మి(50) మీన్పూర్లోని ఒక హోటల్లో పనిచేస్తోంది. బుధవారం ఆమె బైక్పై విధులకు వెళ్తుండగా కూకట్పల్లిపోలీసు స్టేషన్ ముందే ఒక కాలేజీ బస్సు ఆమె బైక్ను ఢీకొట్టింది.
Also Read:వారణాసిలో మాంసం బంద్…!ఇక శాఖాహారమే…?
దీంతో లక్ష్మీ కింద పడిపోగా, ఆమెపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. . స్థానికుల సమాచారం మేరకు కూకట్పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:సముద్రంలో విమానాశ్రయం…!