క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ జర్నలిస్టు కేయూ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడం పట్ల బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం ఏపీకి తొత్తుగా ఉండొచ్చు కానీ, రాష్ట్ర ప్రజలు, జర్నలిస్టులు అలా ఉండాల్సిన అవసరం లేదని ఆమె విమర్శించారు.పొలిటికల్ కామెంట్ చేసినందుకు ఒక జర్నలిస్టును ఏపీ పోలీసులు వచ్చి అరెస్టు చేయడం, దానికి ఇక్కడి తెలంగాణ పోలీసులు సహకరించడం సిగ్గుచేటని కవిత మండిపడ్డారు. అరెస్టు సమయంలో కేయూ రెడ్డిని పోలీసులు లాక్కెళుతుంటే ఆయన భార్యాపిల్లలు రోదించిన వీడియో హృదయ విదారకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ వాదాన్ని వేర్పాటు వాదమనే సినిమా నటుల విషయంలో ఇక్కడి పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కవిత ఎండగట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన: తెలంగాణలో భారీ, ఏపీలో మోస్తరు వర్షాలు
వందేళ్లలో మూడోసారి కరువు…! జూన్లో తక్కువ వర్షపాతం నమోదు…