క్రైమ్ మిర్రర్, పాలకీడు:- పాలకీడు మండలం మూసి ఒడ్డు సింగారం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం రామాలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పురోహితులు అన్నం బోట్ల ఫణి కుమార్ శర్మ ,వేద పండితులు రాయప్రోలు శ్రీరామయ్య శర్మ ,రాళ్ల బండి రాజశేఖర్ శర్మ ,అన్నం బొట్ల ప్రణయ్ కుమార్ శర్మ ,మందపూడి సాయికిరణ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు,హోమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ ఉమ బాబు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ వేల ఏపీలో గ్యాస్ కొరత..!
ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : పంతంగి రాజ్భూపాల్గౌడ్
