క్రైమ్ మిర్రర్,రాజకీయం:- తమిళనాడులో రాజకీయాలు ప్రతిరోజు కూడా వాడి వేడిగా ముందుకు సాగుతున్నాయి. తాజాగా తమిళనాడు రాజకీయాలలో త్రిష కీలక పాత్ర పోషిస్తుంది అని ఎన్నో వార్తలు వస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హీరోయిన్ త్రిష చుట్టూనే తిరుగుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే త్రిష.. విజయ్ టీవీకె పార్టీలో చేరబోతుంది అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకోసం ఇప్పటినుంచి సినిమాలకు సైన్ చేయకుండా కామ్ గా ఉంటూ.. తమిళనాడు రాజకీయాల్లో లోతైన విశ్లేషణ చేసింది అని వార్తలు వస్తున్నాయి. విజయ్ భార్యతో విడాకులు సెటిల్మెంట్ తర్వాత త్రిషను విజయ వివాహం చేసుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు విజయ్ టీవీకే పార్టీ ఎన్డీఏతో పొత్తు నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉంది అంటూ ఎన్నో విధాలుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల అమిత్ షా తో త్రిష భేటీ అవ్వడమే ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది అని అర్థమవుతుంది. త్వరలోనే తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు తప్పేలాగా కనిపించడం లేదు. దీంతో తమిళ రాష్ట్ర రాజకీయాలని కూడా త్రిష చుట్టూనే తిరుగుతుండడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఈమె పేరే ఎక్కువగా వినిపిస్తుంది.
ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం : మంత్రి పొంగులేటి
కొత్త పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
