క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- కాంగ్రెస్ కీలక నేత, మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మండలి వేదికగా ఇందిరమ్మ ఇండ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే వేసవి నెలల్లో అనగా ఏప్రిల్ మరియు మే నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కచ్చితంగా ఉంటుంది అని స్పష్టం చేశారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ అని మరోసారి స్పష్టం చేశారు. రాబోయే మూడు సంవత్సరాలలో పట్టణ ప్రాంతాల్లోని ప్రతి వార్డులో కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాము అని పొంగులేటి హామీ ఇచ్చారు. ఇక గతంలో ప్రారంభమై వివిధ పద్ధతుల్లో ఆగిపోయినటువంటి ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుంది అని స్పష్టం చేశారు.
కొత్త పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
క్వారీలు అడ్డదారిగా పొందినవే…! ప్రభుత్వం విచారణ జరిపించాలి
