Tuesday, March 10, 2026
HomeతెలంగాణBandi Sanjay: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు హిందువుల్లో కసిని పెంచాయి

Bandi Sanjay: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు హిందువుల్లో కసిని పెంచాయి

Bandi Sanjay: రాష్ట్రంలో హిందువులంతా ఒకే తాటిపైకి వచ్చి, తమ ఓటు శక్తి ఎంత ప్రభావాన్ని చూపగలదో గుర్తించే సమయం వచ్చిందని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కూకట్‌పల్లిలో జరిగిన కాపు కులస్తుల కార్తీక వనభోజనాల సందర్భంగా మాట్లాడిన ఆయన.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు హిందువుల్లో కొత్త ఉత్సాహాన్ని, కసిని రేకెత్తించాయని వ్యాఖ్యానించారు. అక్కడి ఫలితాలు కొందరు ముస్లింలకు అనుకూలంగా మారిన తీరు హిందువుల్లో అసంతృప్తిని పెంచిందని తెలిపారు. ఇకనైనా హిందువులు విభజనలను మరచి, ఒకటై తమ ఓటుతో హిందూ ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

మత మార్పిడి దేవుళ్లను మోసం చేసినట్లేనంటూ దీని వెనుక ఉన్న ప్రమాదాలను హిందువులు గమనించాలన్నారు. ఇతర మతాల్లో చేరిన వారు తిరిగి తమ మూలాలకు రావాలన్న ఉద్దేశంతో ఘర్ వాపసీ కార్యక్రమాలను హిందూ ధర్మ రక్షణలో కీలకంగా పేర్కొన్నారు. హిందూ సనాతన ధర్మం ప్రపంచంలోనే గొప్ప జీవన విధానమని, హిందువుగా పుట్టడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని ఆయన స్పష్టం చేశారు. అన్ని కులాలు సామాజికంగా ఎదుగుతూ, హిందూ ధర్మ రక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం కారణంగా మతమార్పిడి చేసిన చాలా మందిలో పునరాలోచన మొదలైందని చెప్పారు. కార్తీక వనభోజనాలు నిర్వహిస్తున్న అన్ని కులాలకూ అభినందనలు తెలుపుతూ, హిందూ సమాజం ఐక్యంగా ముందుకు సాగితే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలదని బండి సంజయ్ పేర్కొన్నారు.

ALSO READ: Manchu Lakshmi: అది తల్చుకుని కిందపడి ఏడ్చా

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments