Monday, March 23, 2026
Homeఆంధ్ర ప్రదేశ్అవన్ని అవాస్తవాలు.. సచివాలయాల పేరు మార్చలేదు : CMO

అవన్ని అవాస్తవాలు.. సచివాలయాల పేరు మార్చలేదు : CMO

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయ పేరును మారుస్తున్నట్లుగా వస్తున్నటువంటి వార్తలు అవాస్తవమని తాజాగా సీఎంఓ వివరణ ఇచ్చింది. ఈ గ్రామ సచివాలయాల పేరును విజన్ యూనిట్లుగా మార్చుతారు అని వస్తున్నటువంటి వార్తలను ప్రజలు ఎవరు నమ్మవద్దు అని సూచించింది. ఇక 2027 స్వర్ణాంధ్ర విజయం సాధన కోసం విజన్ యూనిట్లుగా గ్రామ మరియు వార్డు సచివాలయాలు పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను జారీ చేశారని పేర్కొన్నారు. కేవలం ఒక విజన్ గా గ్రామం మరియు వార్డు సచివాలయాలు పనిచేయాలి అని సూచించారే తప్ప వాటి పేరును విజన్ యూనిట్లుగా మార్చట్లేదని తెలిపారు. కాగా సచివాలయం అన్న పేరు వినగానే ప్రతి ఒక్కరికి కూడా జగనే గుర్తుకు వస్తారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలోనే ప్రతి గ్రామంలోనూ సచివాలయము నిర్మించి.. చిన్న చిన్న పనుల నుంచి పెద్దపెద్ద పనులు వరకు కూడా ప్రతి ఒక్కటి అందులోనే ఇబ్బందులు లేకుండా పరిష్కరించుకునే విధానం తీసుకువచ్చారు జగన్. దీని ద్వారా ప్రజలకు కూడా చాలా అంటే చాలానే మేలు జరిగింది.

Read also : మరో మతాన్ని కించపరచను.. తలైన నరుక్కుంటా కానీ ముస్లిం టోపీ పెట్టుకోను : బండి సంజయ్

Read also : యువతే కదా ఏం చేస్తారు అనుకోకండి.. తలచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి : వైయస్ జగన్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments