బాలీవుడ్ ప్రముఖ హీరోకు బెదిరింపులు..?

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- బాలీవుడ్ ప్రముఖ హీరో రణ్వీర్ సింగ్ కు తాజాగా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం. కొన్ని కోట్ల రూపాయల్లో డబ్బులు డిమాండ్ చేస్తూ అతనికి కొంతమంది దుండగులు వాయిస్ మెసేజ్ పెట్టినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్ళగా అప్రమత్తమైన ముంబై పోలీసులు నటుడు రన్వీర్ సింగ్ ఇంటి వద్ద భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. వెంటనే వాయిస్ మెసేజ్ పంపించినటువంటి దుండగులను కనుగొనే విధంగా పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే రణవీర్ సింగ్ ఈ విషయంపై అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినప్పటికీ కూడా దర్యాప్తు చేస్తున్నారన్నట్లుగా సమాచారం వైరల్ అవుతుంది. కాగా కొద్ది రోజుల క్రితమే రన్వీర్ సింగ్ హీరోగా నటించినటువంటి “దురందర్” సినిమా ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు ఇలా పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ వాయిస్ మెసేజ్ పెట్టినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై పోలీసులు మరిన్ని వివరాలు తెలియజేయాల్సి ఉంది.

అర్జున్ టెండూల్కర్ పెళ్లి.. కుటుంబ సమేతంగా మోదీకి సచిన్ ఆహ్వానం

ITI Student: ప్రియురాలికి వీడియో కాల్ చేసి ఊహించని పని చేసిన బాలుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button