తెలంగాణ

నేడే బీసీ రిజర్వేషన్లపై విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠత!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై గందరగోళం నెలకొంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 9 పై స్టే ఇవ్వాలని అనే పిటీషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఇందులో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తే ప్రస్తుతం ఉన్న ఎస్సీ 15%, ఎస్టీ 10 శాతంతో కలిపి రిజర్వేషన్లు మొత్తం 67 శాతానికి చేరుతాయని, అప్పుడు ఇది పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 కి పూర్తిగా విరుద్ధమని పిటిషనర్ సుప్రీంకోర్టుకు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు విచారణ జరిపి ఇచ్చే తీర్పుపై చాలా ఉత్కంఠత నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్పుపై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు హైకోర్టులో కూడా ఇదే అంశంపై ఎల్లుండి అనగా.. 8వ తేదీన విచారణ జరగనుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలలో గందరగోళపు పరిస్థితులు ఏర్పడ్డాయి.

Read also : ఇదిగో… ఎంగేజ్మెంట్ రింగ్ ఇదేనా?

Read also : ఈ సినిమా చూసి మనోళ్లు సిగ్గుపడాలి… మిగతా వాళ్ళకి హ్యాట్సాఫ్ : ఆర్జీవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button