మునుగోడు,క్రైమ్ మిర్రర్:- ప్రతి రోజు సాయంత్రం 6 లోపు వైన్ షాపుల పర్మిషన్ రూములలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైన్ షాపులను పరిశీలించి మరో మారు వైన్ షాప్ నిర్వాహులకు స్పష్టం చేశారు. వైన్ షాపుల సమయపాలన నిర్వహణ తీరును పరిశీలించారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని హైదరాబాద్ రోడ్ లో ఉన్న వైన్ షాప్ వద్ద ఆగి ఎమ్మెల్యే పరిసరాలను పరిశీలించారు. సాయంత్రం 6 గంటల వరకు పర్మిట్ రూమ్ లో గాని చుట్టు పరిసరాల ప్రాంతాల్లో ఎవ్వరు కూడా మందు తాగొద్దని వైన్ షాప్ నిర్వాహకులకు మరో మారు గట్టిగా చెప్పారు. వైన్ షాపుల సమయపాలన నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
దీపారాధనకు నోచుకోని ఆలయం.. గుప్తనిధులకు అడ్డాగా మారిందా..?
ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్ సంతోష్ యాదవ్
