ఓటుకు నోటు ఇవ్వొద్దు.. ఓటుకు నోటు తీసుకోవద్దు

•మోత్కుపల్లిని ఉదాహరణగా తీసుకోవాలి

ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- ఓటుకు నోటు వ్యవస్థ మారాలని.. డబ్బులు ఇవ్వొద్దని,తీసుకోవద్దని ఈ వ్యవస్థను మార్చాలని అందుకొరకై అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ఆత్మకూరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు సీనియర్ నాయకులు ప్రతికంఠం పూర్ణచందర్ రాజు పిలుపునిచ్చారు.ఈ వ్యవస్థ మారకుంటే గ్రామాలు,ప్రజలు దోపిడీకి గురి అవుతారని లంచగొండి తనం పెరిగిపోతుందని.. యువకులు నడుం బిగించి ముందుకురావాలని ఆయన కోరారు. మంచివారికి స్థానం లేకుండా పోయిందని ఇదేవిదంగా కొనసాగితే మంచికి స్థానం లేకుండా పోతుందని వాపోయారు. సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కొక్కరు లక్షలు, కోట్లు ఖర్చు చేస్తారని.. ఓడిన వారు గెలిచిన వారు అప్పులపాలై ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు. గతంలో మోత్కుపల్లి ‌నరసింహులు యంఎల్ఏ గా ఆరుసార్లు డబ్బులు, మద్యం, ఖర్చు లేకుండా ఎన్నికయ్యారని గుర్తుచేసారు. అందరం ఒకే ఉద్యమంగా తీసుకొని వ్యవస్థను మార్చాలని కోరారు.ఇప్పుడు జరిగే పుర ఎన్నికల్లో డబ్బులు పంచకుండా తీసుకోకుండా యువకులు ఉద్యమించాలని పూర్ణచందర్ రాజు కోరారు.

India Corruption: భారత్ లో తగ్గిన అవినీతి.. సంచలన విషయాలు వెల్లడించిన తాజా రిపోర్టు?

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button