Homeక్రైమ్ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మరో ట్విస్ట్... దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి..

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మరో ట్విస్ట్… దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి..

హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీ (NPA)లో ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గురించి దర్యాప్తులో కొత్త విషయాలు బయటపడినట్లు సమాచారం.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వివాహిత మహిళతో ఆయనకు సన్నిహిత పరిచయం ఉన్నట్లు గుర్తించారు. 2014లో వివాహం జరిగిన ఆ మహిళ, 2023 నుంచి తన భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో, ఆమెతో ‘లివ్-ఇన్ రిలేషన్‌షిప్’లో ఉండాలని ఉదయ్ కృష్ణారెడ్డి కోరినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే, భర్తతో చట్టబద్ధంగా విడాకులు పూర్తికాకపోవడంతో, ఆ మహిళ ఆ ప్రతిపాదనను నిరాకరించినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై పోలీసులు ఆ మహిళ నుంచి స్టేట్‌మెంట్‌ను నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ ఘటనపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ, అకాడమీ వర్గాల్లో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.

also read: జమ్మూకశ్మీర్‌లో ప్రకృతి విలయం.. క్లౌడ్ బరస్ట్‌లతో భారీ నష్టం, 31 మంది మృతి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు